Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి 2” సినిమా చేస్తున్న సమయంలో ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలు.. రాధే శ్యామ్, సాహో. ఈ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. “బాహుబలి 2” వంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలు ప్రస్తుతం వస్తున్నాయి. అవేంటంటే ఆది పురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే..ఇంకా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా. వీటిలో రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆది పురుష్, సలార్. ఈ రెండూ వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Prabhas confirms project with another Bollywood director Siddharth Anand
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొదటిగా వచ్చేది ఆది పురుష్(Adipurush). బాలీవుడ్ డైరక్టర్ ఓమ్ రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత వచ్చే వేసవి ఏప్రిల్ మాసంలో “సలార్” రిలీజ్. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పుడు మరో బాలీవుడ్ డైరెక్టర్ తో కలిసి పని చేయడానికి రెడీ అయినట్లు బీ టౌన్ లో వార్తలు వస్తున్నాయి. ఆయన మరెవరో కాదు సిద్ధార్థ్ ఆనంద్. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వచ్చిన వార్తలకు సంబంధించి ఎవరూ స్పందించలేదు.
అయితే తాజాగా సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) ఇటీవల చెప్పిన ఓ స్క్రిప్ట్ ప్రభాస్ కి బాగా నచ్చటంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ “ఫైటర్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ మాసంలో “ఫైటర్” రిలీజ్ కానుంది. ఆ తర్వాత ప్రభాస్ తో సిద్ధార్థ ఆనంద్ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.