ఈ మధ్య టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల బర్త్ డేలను మరియు ఇతర స్పెషల్ డేస్ ను పురస్కరించుకుని వారి కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలను మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ చిత్రం కూడా రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
ఇంతకీ ఆ చిత్రం మరేదో కాదు.. `వర్షం`. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, త్రిష జంటగా నటించారు. గోపీచంద్ విలన్ గా చేశారు. 2004లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమా వస్తోందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు.
అంతలా ఈ మూవీ ఆకట్టుకుంది. మ్యూజికల్గానూ ఈ మూవీ హిట్ అయింది. అయితే ఈ సినిమాను ప్రభాస్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 22, 23 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత ఎమ్. ఎస్. రాజు అధికారికంగా ప్రకటించారు.
4కె టెక్నాలజీతో వర్షం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. కాగా, ప్రభాస్ నటించిన రెబల్, బిల్లా సినిమాలు సైతం ఈ నెలలో రీ రిలీజ్ కానున్నాయి. అక్టోబర్ 15న ఈ చిత్రాలను విడుదల చేయబోతున్నారు.
https://newsorbit.com/cinema/prabhas-is-ready-for-shooting-again.html