పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కు ఊహించని షాక్ తగిలింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల స్టార్ హీరోల పుట్టినరోజు వస్తోందంటే వారి కెరీర్ లో సూపర్ డూపర్ హిట్గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 23న ప్రభాస్ బర్తడే. ఈ సందర్భంగా అయినా కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ `వర్షం` సినిమాను సైతం అక్టోబర్ 22, 23 తేదీల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రభాస్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు. ఎం. ఎస్. రాజు నిర్మాతగా వ్యవహరించారు. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
అయితే ఈ హిట్ సినిమాను 4కె టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్కు థియేటర్లు దొరకడం లేదట. కొత్త సినిమాలను వదిలి ప్రభాస్ పాత సినిమా అయినా వర్షం కు థియేటర్లు ఇవ్వడం కష్టమని యజమానులు డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారట.
వారం తర్వాత వర్షం రీ రిలీజ్ చేయాలని సూచిస్తున్నారు. దీంతో `వర్షం` రీ రిలీజ్ను అక్టోబర్ 28 కు పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రభాస్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో బర్త్డే నాడు కాకుండా తర్వాత రిలీజ్ చేస్తే ఏం లాభమని పెదవి విరుస్తున్నారు.
https://newsorbit.com/cinema/prabhas-joined-project-k-movie-shooting.html