Sai Pallavi-Prakash Raj: న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. `కశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించిన కశ్మీర్ పండిట్ల హత్యలకు, గోరక్షక దళాలు చేస్తున్న దాడుల మధ్య తేడా ఏముందంటూ` వివాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈమె వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సాయి పల్లవిపై భజరంగ్ దళ్ నేతలు పోలీసు కేసు కూడా నమోదు చేశారు.
ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సాయిపల్లవి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని మండిపడ్డారు. అయితే ఈ వివాదంపై సాయి పల్లవి వివరణ ఇచ్చింది. నేను మాట్లాడిన మాటలను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒక విషయంలో రైట్, లెఫ్ట్ అని అడిగితే తాను న్యూట్రల్ అని చెప్పినట్లుగా స్పష్టం చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఒక వర్గానికి చెందిన వారి కంటే ముందు మనం మంచి మనుషులుగా ఉండాలని తాను నమ్ముతానని, తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికి తప్పేనని, ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని, అందరూ మానవత్వంతో ఉండాలని ఆమె చెప్పుకొచ్చింది. మతాల పేరిట చేసే హింస మహాపాపం అని చెప్పాలనుకున్నా, తన వ్యాఖ్యల కారణంగా ఎవరైనా మనస్తాపం చెంది ఉంటే క్షమించాలని కూడా సాయి పల్లవి కోరింది.
అయితే సాయి పల్లవి వివరణకు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. తన మద్దతును ఆమెకు తెలిపారు. `మానవత్వమే అన్నింటికంటే ముందు… కాబట్టే సాయి పల్లవి మేము నీతోనే ఉన్నాం` అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ప్రకాశ్ రాజ్ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
Humanity first … we are with you @Sai_Pallavi92 https://t.co/6Zip4FJPv3
— Prakash Raj (@prakashraaj) June 19, 2022