పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో `సలార్` ఒకటి. కేజీఎఫ్ సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఏదైనా కీలక పాత్రలో నటిస్తున్నారేమో అని అందరూ భావించారు. కానీ ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో పృథ్వీరాజ్ కనిపించబోతున్నారు.
ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో సలార్ టీం పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బయటకు వదిలారు. `వర్ధరాజ మన్నార్` అనే కౄరమైన విలన్ పాత్రలో పృథ్వీరాజ్ కనిపించబోతున్నాడని పోస్టర్ ద్వారా స్పష్టమైంది. ముఖానికి మసి, చెవులకు పోగులు, ముక్కు పుడక, మెడలో కడియాలు ధరించి పృథ్వీరాజ్ ఎంతో గంభీరంగా కనిపిస్తున్నారు.
దీంతో పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. కాగా, ఈ చిత్రంలో జగపతిబాబు `రాజా మన్నార్` అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే వీరి పేర్లను బట్టి చూస్తే జగపతిబాబు, పృథ్వీరాజ్ తండ్రీకొడుకులు లేదా అన్నదమ్ములుగా కనిపించనున్నారని అంచనా వేస్తున్నారు.
https://www.instagram.com/p/CjwuULQPrt3/?utm_source=ig_web_copy_link