`సర్కారు వారి పాట` వంటి బ్లాక్ బస్టర్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం.. `ఎస్ఎస్ఎమ్బీ 28`వర్కింగ్ టైటిల్తో ఆగస్టు నెల నుండి సెట్స్ మీదకు వెళ్లబోతోంది.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించబోతున్నాడు. విక్రమ్-మహేశ్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన దూకుడు, ఖలేజ చిత్రాలు కమర్షియల్గా హిట్ అవ్వకపోయినా.. ప్రేక్షకులను అలరించాయి.
మహేశ్తో ఒక్కసారైనా చేయాలి.. రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్!
దీంతో వీరి తాజా ప్రాజెక్ట్పై సైతం మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో మహేశ్ను ఢీ కొట్టే విలన్గా ఓ స్టార్ హీరో నటించబోతున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. మలయాళ స్టార్ హీరోల్లో ఒకరు అయినా పృథ్వీరాజ్ సుకుమారన్.
మెయిన్ విలన్గా పృథ్వీరాజ్ బాగా సెట్ అవుతాడని భావించిన త్రివిక్రమ్.. రీసెంట్గా ఆయన్ను సంప్రదించారట. కథను కూడా వివరించారట. స్టోరీ బాగా నచ్చడంతో.. ఆయన ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, ఈ ప్రచారమే నిజమైతే మహేశ్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయమవుతుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!