క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం `పుష్ప ది రైజ్`. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ చిత్రం.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఇక ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా `పుష్ప ది రూల్` టైటిల్తో పార్ట్ 2 రాబోతోంది. ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నా.. స్క్రిప్ట్లో సుకుమార్ పలు మార్పులు, చేర్పులు చేయడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి రెండో భాగం రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.
`పుష్ప 2`లో సమంత.. ఈసారి ఐటెం భామగా కాదండోయ్..?!
ఇదిలా ఉంటే.. `పుష్ప 2`కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఇందులో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా అలరించబోతోందట. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నట్టుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు విజయ్ సేతుపతికు జోడీగా ప్రియమణిని తీసుకున్నారని.. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.