`లైగర్`.. విజయ్ దేవరకొండ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రమిది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తే.. రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, గెటప్ శీను, మైక్ టైసన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్తో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ ఈ మూవీని నిర్మించారు. ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ను మూటగట్టుకుంది. రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లో రూ. 24.44 కోట్లను మాత్రమే రాబట్టిగలిగింది.
ఈ మూవీ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే ఇంకా రూ. 65.56 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. కానీ, అంత పెద్ద టార్గెట్ను విజయ్ అందుకోవడం కష్టమే అని అంటున్నారు. దీంతో ఈ సినిమా వల్ల మేకర్స్కు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.
ఇకపోతే `లైగర్` డిజాస్టర్ అవ్వడంపై తాజాగా నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఛార్మీ మాట్లాడుతూ.. `2019నుంచి లైగర్ కోసం కష్టపడ్డాం. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత లైగర్ను ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చాం. ఎన్నో అడ్డంకులను దాటి థియేటర్లో విడుదల చేశాం. కానీ సినిమా ఫెయిల్యూర్ అవడం బాధగా అనిపిస్తుంది` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.