Puri Jagannadh: టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెలలలోనే సినిమాలు చేసి అత్యధికమైన విజయాలు సాధించే సత్తా కలిగిన డైరెక్టర్. మహేష్ బాబుతో “పోకిరి” చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ ఇంకా కొంతమంది హీరోలు తమ కెరియర్ లో చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే పూరీతో చేసిన సినిమాలు మరొక ఎత్తు. అటువంటి పూరీ జగన్నాథ్ ప్రస్తుతం పరాజయాలతో సతమతమవుతున్నాడు. వరుసపరాజయాల మీద ఉన్న పూరి 2019 వ సంవత్సరంలో “ఇస్మార్ట్ శంకర్”తో హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే.
అయితే ఆ తర్వాత హీరో విజయ్ దేవరకొండతో చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ “లైగర్” ఈ ఏడాది ఆగస్టు నెలలో విడుదలై దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఎగ్జిబిటర్లు ఎంతగానో నష్టపోయారు. అయితే సినిమా రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ లో కొంత సొమ్ము వెనక్కి ఇచ్చేయడం తెలిసిందే. ఇక అదే సమయంలో నష్టపోయిన ఎగ్జిబిటర్లుకి తగిన న్యాయం చేస్తానని పూరి జగన్నాథ్ హామీ ఇచ్చారు. పూరి మాట ఇచ్చినా గాని నష్టపోయిన “లైగర్” ఎగ్జిబిటర్లు … దాదాపు 83 మంది పూరి జగన్నాథ్ ఆఫీస్ వద్ద ధర్నా చేయాలని డిసైడ్ అయి ఆయనకు లెటర్ పంపడం జరిగిందంట. ఈ నేపథ్యంలో పూరి ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. తనకి లెటర్ రావడం ధర్నా చేయడానికి ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవడాని ఆడియోలో పూరి జగన్నాథ్ తప్పు పట్టారు.
బ్లాక్మెయిలింగ్ కి దిగితే వేరేలా ఉంటుందని తెలియజేశారు. ఇస్తానని చెప్పినా గాని ఇలా ఓవరాక్షన్ చేస్తే ఇచ్చే రూపాయి కూడా ఇవ్వబుద్ధి కాదు. నా పరువు తీయాలని చూస్తే రూపాయి కూడా ఇవ్వను. “పోకిరి” నుండి “ఇస్మార్ట్ శంకర్” వరకు బయ్యర్స్ నుండి నాకు రావలసిన డబ్బు ఎంతో ఉంది. ఆ అమౌంట్ వసూలు చేసి పెడతారా అంటూ ఆడియోలో పూరి జగన్నాథ్ మాట్లాడారు. ఏది ఏమైనా ఎగ్జిబిటర్లకు మాట ఇచ్చినా గాని.. తన ఆఫీసు ముందు ధర్నాకి దిగుతామని.. లెటర్ రావడం పై పూరి చాలా సీరియస్ గా సదరు ఫోన్ కాల్ ఆడియోలో మాట్లాడటం జరిగింది. పూరి ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!