డైరెక్టర్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న పూరి జగన్నాథ్.. నటుడుగా మారబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న `గాడ్ ఫాదర్` చిత్రంలో ఆయన ఓ పాత్రను పోషిస్తున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ `లూసిఫర్`కు రీమేక్ ఇది.
కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్ర ఖని తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఈ సినిమాతోనే పూరి జగన్నాథ్ నటుడిగా మారబోతున్నారు. అయితే `గాడ్ ఫాదర్`లో తన రోల్ ఏంటో తాజాగా పూరి లీక్ చేసేశారు. `లైగర్` ప్రమోషన్స్ భాగంగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న పూరి జగన్నాథ్.. తాను నటుడుగా ఫస్ట్ టైం చిరు `గాడ్ ఫాథర్` లో చేస్తున్నానని, ఈ చిత్రంలో తాను ఒక జర్నలిస్ట్ గా కనిపించబోతున్నానని చెప్పేశారు.
దాంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి. కాగా, `లైగర్` విషయానికి వస్తే.. ఇదో పాన్ ఇండియా ఫిల్మ్. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించారు. ఆగుస్టు 25న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.