`ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం `లైగర్`. ఇందులో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేరకొండ హీరోగా నటిస్తే.. అనన్య పాండే హీరోయిన్గా నటించింది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, ఛార్మీలు నిర్మించారు.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇదిలా ఉంటే.. `లైగర్` షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి పూరీ జగన్నాథ్, ఛార్మీలు ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. `లైగర్`ను ఎక్కువ భాగం అక్కడే చిత్రీకరించారు.
ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్, ఛార్మీలు ముంబైలో అరేబియన్ సీ వ్యూ కలిగిన ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ను తీసుకుని ఉంటున్నారు. ఈ అపార్ట్మెంట్ రెంట్ నెలకు రూ. 10 లక్షలు ఉంటుందట. అయితే లైగర్ బిగ్ డిజాస్టర్ అవ్వడంతో.. భారీ నష్టాలు వచ్చాయి. అయితే లైగర్ దెబ్బకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూరీ జగన్నాథ్.. అద్దె కట్టలేక ముంబై అపార్ట్మెంట్ ను ఖాళీ చేసినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై ఛార్మీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. `రూమర్స్ రూమర్స్ రూమర్స్.. రూమర్స్ అన్నీ ఫేక్. మేము కేవలం ఇప్పుడు పూరి కనెక్ట్స్ పురోగతిపై దృష్టి సారించాము. ఇంతలోనే రూమర్స్ విసిగిస్తున్నాయి` అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు ఆమె ట్వీట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది.
Rumours rumours rumours!
All rumours are fake!
Just focusing on the progress of 𝐏𝐂 ..
Meanwhile, RIP rumours !!— Charmme Kaur (@Charmmeofficial) September 8, 2022