ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్`. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ఫహద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటించగా.. ధనంజయ, అనసూయ, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. మొదట నెగటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో పుష్పరాజ్గా డీ గ్లామర్ పాత్రలో బన్నీ విశ్వరూపం చూపించారు.
ఇకపోతే ఇప్పుడు ఈ మూవీకి పార్ట్ 2 రాబోతోంది. `పుష్ప ది రూల్` టైటిల్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ప్రస్తుతం సుకుమార్ కథపై మార్పులు చేర్పులు చేస్తూ కసరత్తులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ నయా అప్డేట్ నెట్టింట వైరల్గా మారింది.
పుష్ప పార్ట్ 1ను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్ట్ 2ను ఈ ఐదు భాషలతో పాటు మరో ఐదు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ను కలిపి మొత్తం పది భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అలాగే ఈ మూవీని రూ. 350 కోట్ల బడ్జెట్తో రూపొందించబోతున్నారట.