టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం రాజమౌళి చేస్తున్న చిత్రమిది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సీనియర్ నిర్మాత కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు.
రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి కథ అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ కథ ఏంటో రాజమౌళి చెప్పేశారు. ఓ ఫిలిం ఫెస్టివల్ కోసం టొరంటో వెళ్లిన రాజమౌళి.. అక్కడ మహేష్ బాబు సినిమా గురించి ప్రస్తావించారు.
ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథే ఈ సినిమా అని రాజమౌళి స్పష్టం చేశారు. యాక్షన్ అడ్వెంచరస్ జోనర్లో ఈ మూవీ ఉండబోతోందని ఆయన వెల్లడించారు. ఈయన ఇచ్చిన అప్డేట్తో మహేష్ బాబు అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
కాగా, మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ మూవీ చేస్తున్నాడు. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పూర్తైన వెంటనే మహేశ్ రాజమౌళి ప్రాజెక్ట్పై ఫోకస్ పెట్టనున్నాడు.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!