పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్టుల్లో `ఆదిపురుష్` ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే తదితరులు కీలక పాత్రలను పోషించారు.
అయితే నిన్న అయోధ్యలో భారీ ఈవెంట్ను నిర్వహించి ఈ మూవీ టీజర్ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఈ టీజర్ కు విశేష ఆదరణ లభించింది. అయితే మరోవైపు ఈ టీజర్ పై కాస్త నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభాస్తో కర్టూన్ సినిమా చేశారంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
గ్రాఫిక్స్ వరస్ట్ గా ఉన్నాయని, రజినీకాంత్ కొచ్చాడియాన్ గుర్తుకొచ్చిందంటూ కూడా విమర్శల వర్షం కరుపించారు. అయితే తాజాగా `ఆదిపురుష్`పై రాజమౌళి సోదరుడు ఎస్.ఎస్.కాంచి పరోక్షంగా సెటైర్లు వేశారు. ఆదిపురుష్ ను తీయడంతో ఓం రౌత్ విఫలం అయ్యాడని అర్థం వచ్చేలా `పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి` అంటూ కాంచి ట్వీట్ చేశారు.
అయితే ఆ ట్వీట్పై కొంతమంది ఏకీభవించినా మరికొంత మంది మండిపడుతున్నారు. తెలుగు వారు తీసినన్ని పౌరాణికాలు ఇంకెవ్వరు తియ్యలేదు. మిగతా వాళ్ళు కూడా బాగా తీయచ్చు కానీ మన వాళ్ళు ఒక్క మెట్టు పైన ఉంటారు అంటూ కొందరు కాంచిని సమర్థిస్తుంటే.. హిందీ స్టార్ ప్లస్ లో వచ్చిన మహాభారతం, రామాయణం కొన్నేళ్ల క్రితమే భారతదేశం మొత్తం మళ్ళీ మళ్ళీ చూసేలా తీశారు, హిందీలో శ్రీకృష్ణ, ఓం నమశ్శివాయ , జై హనుమాన్ లాంటి సీరియల్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అంటూ మరికొందరు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి కాంచి ట్వీట్ మాత్రం వైరల్గా మారింది.