దర్శక ధీరుడు రాజమౌళి జపాన్లో కెమెరామెన్ గా మారారు. అవును మీరు విన్నది నిజమే. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చి లో విడుదలైన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇండియా హిస్టరీలోనే హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా జపాన్లో విడుదల కాబోతోంది. అక్కడ రాజమౌళి బాహుబలి సినిమాకి మంచి క్రేజ్ లభించిన నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 21న ఈ సినిమా జపాన్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్లతో రాజమౌళి అక్కడికి వెళ్లి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు రామ్ చరణ్లు ఓవైపు ప్రమోషన్స్ లో పాల్గొంటూనే.. మరోవైపు ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. జపాన్ లో చూడదగ్గ ప్రదేశాలన్నీ చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన ఇన్స్టాగ్రామ్ వేదిక ఓ పిక్ను షేర్ చేసింది. ఇందులో చరణ్ ఉపాసనలు ఎంతో అందంగా మెరిసిపోతూ కనిపించారు.
అయితే ఈ పిక్కు ఓ స్పెషాలిటీ ఉంది. ఈ పిక్ను క్లిక్ మనిపించింది మరెవరో కాదు రాజమౌళినే. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా తెలిపింది. తమకు ఈ ఫోటో ఎంతో మెమొరబుల్ అని కూడా ఉపాసన పేర్కొంది. దీంతో ఉపాసన షేర్ చేసిన పిక్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. మొత్తానికి అలా రాజమౌళి కెమెరామెన్ గా మారారు.