రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంది. తెలుగులో ఈ బ్యూటీ చివరిసారిగా `కొండపొలం` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
ఇటీవలే `డాక్టర్ జీ` అనే సినిమాతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా, రకుల్ జంటగా నటించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.
సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో రకుల్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. తరచూ మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్లతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేసే రకుల్.. తాజాగా కూడా ఏమి అందంరా బాబు అనేంతలా ఆకట్టుకుంది.
బ్లాక్ అండ్ బ్లాక్ ట్రెండీ దోస్తుల్లో పరవాలు విందు చేసింది. ప్రస్తుతం రకుల్ తాజా పిక్స్ నెటిజన్ల మతులను చెడగొడుతూ నెట్టింట వైరల్ గా మారాయి. మరి లేటెందుకు మీరు కూడా రకుల్ లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కేసేయండి.