టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలె `ది వారియర్`తో ప్రేక్షకులను పలకరించాడు. తమిళ దర్శకుడు ఎన్. లింగుసామి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలై.. డిజాస్టర్గా మిగిలింది. అయితే ఈ మూవీ అనంతరం రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నాడు.
`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ అనంతరం బోయపాటి చేస్తున్న సినిమా ఇది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైన ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
రామ్కు ఇది 20వ ప్రాజెక్ట్ కాగా.. బోయపాటికి 10వ చిత్రం కావడం విశేషం. ఇకపోతే తాజాగా ఈ సినిమా కథ లీకైంది. ఇప్పటి వరకు మాస్ చిత్రాలతో అలరించిన బోయపాటి.. ఈసారి జోనర్ మార్చి రామ్ తో ప్రయోగం చేయబోతున్నాడట. రాబరీ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా కథ సాగుతుందట.
అంతేకాదు, ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని.. అందులో రామ్ పోషించబోయే ఒక పాత్ర దొంత పాత్ర అని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో రష్మిక, ప్రియాంక అరుళ్ మోహన్ లను హీరోయిన్లుగా ఎంపిక చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజుల వెయిట్ చేయాల్సిందే.