సమంత ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `శాకుంతలం` ఒకటి. పౌరాణిక నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, మోహన్ బాబు, ప్రకరాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అల్లు అర్హ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమా.. ఎప్పుడో షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. అయితే విడుదల విషయంలో మాత్రం సస్పెన్స్ నెలకొంది. ఈ సస్పెన్స్ను తెర దించుతూ నేడు `శాకుంతలం` రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు.
ఈ ఏడాది నవంబర్ 4న `శాకుంతలం` ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ అప్డేట్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అందుకు కారణం లేకపోలేదు.. `శాకుంతలం`కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న దిల్ రాజునే రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న `ఆర్సీ 15`ను నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. షూటింగ్కు కూడా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ అభిమానులు దిల్ రాజును ఏకేస్తున్నారు. అన్ని సినిమాల అప్డేట్లు ఇస్తున్నారు, రామ్ చరణ్ `ఆర్సీ15` సినిమా అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఈ విషయంపై దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.
Oka amma ki Abba ki pudte #RC15 update ivvu pic.twitter.com/Dj0TuFFuUf
— I'm Vengeance (@__ImVengeance__) September 23, 2022
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!