Ram Charan-Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి ఇటలీ బయల్దేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఇంత సడెన్గా భార్యతో చరణ్ ఇటలీ వెళ్లడానికి ఓ స్పెషాలిటీ ఉంది. జూన్ 14కు ఈ దంపతులు వివాహ బంధంతో ఒకటై దశాబ్దం గడుస్తోంది.
రామ్ చరణ్ – ఉపాసనది ప్రేమ వివాహం. ఐదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2012 జూన్ 14న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లై పదేళ్ల కావొస్తోంది. ఈ నేపథ్యంలోనే పదో వివాహ వార్షికోత్సవాన్ని విదేశాల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు ఇటలీ వెళ్లారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు, అనిల్ – శోభన దంపతుల కుమార్తె అయిన ఉపాసన.. అపోలో సంస్థలకు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తోంది. అలాగే పలు సేవా కార్యక్రమాలను కూడా ఆమె నిర్వహిస్తుంటుంది. మరోవైపు రామ్ చరణ్ స్టార్ హీరో దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం ఈయన ఇండియన్ స్టార్ డైరెక్టర్స్లో ఒకరైన శంకర్తో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్తో గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాఉంది. ఇక ఈ మూవీ అనంతరం చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కించనున్నాడు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!