మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో రీమేక్ చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా విడుదలైన `గాడ్ ఫాదర్` సైతం రీమేక్ మూవీ నే. మలయాళ హిట్ `లూసిఫర్`కు రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు.
దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సినిమా చిరంజీవి చేయడానికి ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రధాన కారణం. చిరంజీవిని ఒప్పించడం దగ్గర నుంచి దర్శకుడిపి ఎంపిక చేయడం వరకు అన్నీ చెర్రీనే దగ్గరుండి చూసుకున్నాడు. కట్ చేస్తే ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఈ నేపథ్యంలోనే తన తండ్రి కోసం చరణ్ మరో రీమేక్పై కన్నేశారట. అది కూడా మలయాళ సూపర్ హిట్టే అట. మలయాళంలో స్టార్ హీరో మమ్ముట్టి నటించిన `భీష్మ పర్వం`సిని మా ఈ ఏడాది ఆరంభంలో విడుదలై మంచి విజయం సాధించింది. అమల్ నీరాద్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ స్టార్ డ్రామా ఇది.
అయితే ఈ సినిమా రామ్ చరణ్కు బాగా నచ్చేసిందట. వెంటనే చిరంజీవిని సంప్రదించగా ఆయనకు కూడా కథ నచడంతో రీమేక్ చేయాలని తండ్రి కొడుకులు నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే భీష్మ పర్వం రీమేక్ హక్కులను దక్కించుకునే దిశగా చరణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
https://newsorbit.com/cinema/chiranjeevi-gave-freedom-to-ram-charan-during-acharya.html