డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` మూవీతో వరుస పరాజయాల తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. మళ్లీ వరుస ఫ్లాపుల్లో మునిగిపోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ అనంతరం రామ్ నుంచి రెండు చిత్రాలు వచ్చాయి. అందులో `రెడ్` ఒకటి కాగా.. మరొకటి `ది వారియర్`.
ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ప్రస్తుతం రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది రామ్ కు 20వ ప్రాజెక్ట్ అయితే.. బోయపాటికి 10వ సినిమా కావడం విశేషం. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవల్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బోయపాటి నుంచి రాబోతున్న చిత్రమిది. ఈ మూవీపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ అనంతరం రామ్ ఏ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడు అనే దానిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. బోయపాటి తరువత కె.రాధాకృష్ణ కుమార్ తో రామ్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట.
అయితే రాధాకష్ణ చివరిగా ప్రభాస్ తో `రాధేశ్యామ్` అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్కు బిగ్ ఫ్లాప్ ఇచ్చిన రాధాకృష్ణతో రామ్ సినిమా చేయబోతున్నాడని వార్తలు రావడంతో ఆయన ఫ్యాన్స్ వర్రీ అయిపోతున్నారు.