మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ ఇందులో హీరోయిన్లుగా నటించారు.
తొట్టెంపూడి వేణు, నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అలాగే రవితేజ ఎం.ఆర్.ఓ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ధర్మం కోసం చట్టాన్ని పక్కన పెట్టిన ఒక అధికారి కథే ఈ సినిమా అని తెలుస్తోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. అనేక వాయిదాల అనంతరం జూలై 29న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. మేకర్స్ ప్రచార కార్యక్రమాలతో ఆ అంచనాలను మరో లెవల్కు తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడీ మూవీ టీమ్కి కొత్త టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్కు కారణం మరేంటో కాదు.. భారీ వర్షాలే.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన `ది వారియర్`, `థ్యాంక్యూ` సినిమా వసూళ్లను కూడా వర్షాలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇప్పుడు మరో మూడు రోజులు భారీ వర్షాలు అంటున్నారు. ఈ నేపథ్యంలో `రామారావు ఆన్ డ్యూటీ` పరిస్థితి ఎలా ఉంటుందా అని టీమ్ ఆందోళన చెందుతోంది. మరి ఈ భారీ వర్షాల గండం నుండి రామారావు బయటపడి నెగ్గుతాడా..లేదా.. అన్నది చూడాలి.