టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం `లైగర్`. బ్యాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. అలాగే రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలి, గెటప్ శీను, మైక్ టైసన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నిన్న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. డిజాస్టర్ టాక్ను సొంతం చేసుకుంది.
అయినప్పటికీ.. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఈ సంగతి పక్కన పెడితే.. `లైగర్`కు రమ్యకృష్ణ అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీలో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండకు తల్లిగా పవర్ ఫుల్ రోల్ను పోషించింది.
అందుకుగానూ ఆమె భారీ రెమ్యునరేషన్ అందుకుందట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు ప్రకారం.. `లైగర్` మూవీకి రమ్యకృష్ణ కోటి రూపాయలు తీసుకుంది. ఇది ఓ హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని రెమ్యునరేషన్ అనడంలో సందేహమే లేదు. ఇక విజయ్ దేవరకొండ రూ. 35 కోట్లు, అనన్య పాండే రూ. 3 కోట్లు అందుకున్నారని తెలుస్తోంది.