Rana-Sai Pallavi: రానా దగ్గుబాటి, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం `విరాటపర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించారు. నందితాదాస్, ప్రియమణి, నవీన్చంద్ర తదితరులు ఈ మూవీ ముఖ్య పాత్రలను పోషించగా.. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు.
నక్సలిజం బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ ప్రేమకథా చిత్రం.. జూన్ 17న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా.. సాయి పల్లవిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సాయిపల్లవి గురించి, ఆమె నటన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. విరాటపర్వం కథ విన్నప్పుడు.. సినిమా ఎలా ఉంటుంది? ఎవరి పాత్రలు ఎలా ఉంటాయో అన్న క్యూరియాసిటీతో పాటు కాస్త కంగారు కూడా ఉండేది. షూటింగ్ పూర్తయిన తర్వాత అనుకున్న దానికన్నా అద్భుతంగా అవుట్పుట్ వచ్చింది.
ఇదంతా సాయిపల్లవిలో సింప్లిసిటీ, నిజాయతీ వల్లే సాధ్యమైంది. సాయి పల్లవి మన సినిమాకు దొరికిన మంచి నటి. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి` అంటూ రానా చెప్పుకొచ్చాడు. దీంతో రానా కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ మారాయి.