బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్లు ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట.. ఫైనల్గా ఏప్రిల్ 14న పెళ్లి బంధంతో ఒకటయ్యారు. రణ్బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తులో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే అలియా భట్ గర్భం దాల్చింది.
ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ఆస్వాదిస్తున్న అలియా భట్.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయితే అలియా భట్కు కవలలు పుట్టబోతున్నారట. ఈ విషయం రణబీర్ స్వయంగా తెలిపాడు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉందండోయ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం `షంషేరా`.
1800 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రణబీర్ ద్విపాత్రాభినయం చేయగా.. సంజయ్ దత్ విలన్గా నటించాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 22న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రణ్బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. యాంకర్ అతడి చేత సరదాగా ఒక గేమ్ ఆడించారు.
ఈ గేమ్లో `రెండు నిజాలు, ఒక అబద్ధం` చెప్పాల్సిందిగా రణ్బీర్ను ఆ యాంకర్ కోరారు. `నేను కవలలకు తండ్రి కాబోతున్నాను. నేను చాలా పెద్ద పౌరాణిక చిత్రంలో భాగం కాబోతున్నాను. నేను పని నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నాను` అని మూడు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే ఈ మూడు విషయాల్లో ఏవి రెండు నిజాలు, ఏది ఒక అబద్ధం అన్నది చెప్పకుండా రణ్బీర్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో అలియా నిజంగా కవలలకు జన్మనిస్తుందా..? లేక రణ్బీర్ అబద్ధం చెప్పాడా..? అన్నది తేల్చలేక అభిమానులు, నెటిజన్లు అయోమయంలో పడ్డారు.