Rashi Khanna: రాశి ఖన్నా.. మూడు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్` తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద తొలి రోజు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. రెండు, మూడు రోజుల్లోనూ బాగానే వసూల్ చేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా రాశి ఖన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఒక స్థాయికి చేరుకున్నాక స్టేటస్ మెయింటైన్ చేయాలని అనేవాళ్లు మన చుట్టూ ఉండటం కామన్, మీకూ అలా ఉన్నారా..? అనే ప్రశ్న ఎదురైంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అందుకు రాశి ఖన్నా.. `అలాంటివి చెప్పడానికి చాలామంది ఉంటారు. కానీ, నేను ఎప్పుడూ అలాంటి వారికి దూరంగా ఉంటా. నాకంటూ ఒక మైండ్ ఉంది. అది చెప్పిన ప్రకారమే ఫాలో అవుతాను. అసలు నన్ను నేను సెలబ్రిటీలా ఎప్పుడూ అనుకోలేదు. సెలబ్రిటీ, కామన్ పీపుల్ అనే తేడా నాకు ఉండదు. కాబట్టి స్టేటస్ కి ప్రాధాన్యం ఇవ్వను.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
కాగా, త్వరలోనే ఈ బ్యూటీ `థ్యాంక్యూ` చిత్రంతో పలకరించబోతోంది. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 22న గ్రాండ్గా విడుదల కాబోతోంది. అలాగే మరోవైపు రాశి ఖన్నా బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `యోధ` అనే మూవీ చేస్తోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!