Rashi Khanna: రాశి ఖన్నా.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `మనం` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. `ఊహలు గుసగుసలాడే `తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్గా మారిన రాశి ఖన్నా.. తర్వలోనే రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది.
అందులో ఓ చిత్రమే `పక్కా కమర్షియల్`. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కిన కమర్షియల్ మూవీ ఇది. గీతా ఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ మూవీ జూలై 1న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో భాగంగానే తాజాగా రాశి ఖన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే `టాలీవుడ్ హీరోల్లో ఏ హీరోతో మీరు సినిమాను చేయాలని కోరుకుంటున్నారు..? అని ప్రశ్నించగా.. అందుకు రాశి టక్కున మహేశ్ బాబు అని చెప్పేసింది.
మహేశ్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో ఒక్కసారైనా సినిమా చేయాలని ఉందంటూ మనసులో ఉన్న కోరికను బయట పెట్టింది. అలాగే మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లు ఓపెన్ కామెంట్స్ చేసింది. మరి రాశి కోరిక నెరవేరేనా..లేదా.. అన్నది చూడాలి.