టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల `లైగర్` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకొన్న `లైగర్` ఆగస్టు 25న భారీ అంచనాల నడుమ విడుదలైంది.
కానీ తొలి రోజు నుంచే ఈ చిత్రం నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అభిమానులు సైతం ఈ సినిమా పై పెదవి విరిచారు. అయితే ఈ సినిమా తనకు నచ్చిందంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం ఈ అమ్మడు `గుడ్ బై` ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో విడుదల కాబోతున్న రష్మిక డబ్యూ మూవీ ఇది.
ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషించారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె విజయ్ దేవరకొండ నటించిన `లైగర్` సినిమాపై స్పందించింది
`లైగర్ సినిమా నాకు బాగా నచ్చింది. విజయ్ తో ఉన్న సన్నిహిత్యం కారణంగా ఇలా చెప్పడం లేదు. నాకు మాస్ మూవీస్ అంటే బాగా ఇష్టం. అందుకే లైగర్ నచ్చింది. ఈ మూవీ చూస్తున్నప్పుడు నేను విజిల్స్ వేశాను, డాన్స్ చేశాను. సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు. నాకు సినిమా నచ్చింది. విజయ్ అదరగొట్టేశాడు.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
https://newsorbit.com/cinema/heroine-rashmika-mandana-warned-fans.html