నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి పరిచయాలు అవసరం లేదు. ఓ కన్నడ మూవీతో సినీ కెరీర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. `ఛలో`తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన టాలెంట్తో ఇక్కడ అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `పుష్ప ది రైస్`లో శ్రీవల్లిగా నటించి.. తన స్టార్డమ్ను డబుల్ చేసుకుని తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది.
ప్రస్తుతం సౌత్తో పాటు నార్త్లోనూ వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి.. తాజాగా బాలీవుడ్లో మరో బంపర్ ఆఫర్ వరించిందట. ఇప్పటికే హిందీలో ఈమె `మిషన్ మజ్ను`, `గుడ్ బై` చిత్రాలు చేస్తోంది. ఇటీవలె రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్ `యానిమల్`లో హీరోయిన్గా ఎంపిక అయింది.
ఇక ఇప్పుడు ఈ బ్యూటీ మరో బాలీవుడ్ హీరోతో రొమాన్స్ చేయబోతోంది. ఆ హీరో ఎవరో కాదు యంగ్ అండ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్. ఈయన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శశాంక్ ఖైతాన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికను తీసుకున్నారట.
ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు. అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. కాగా, రష్మిక ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. తెలుగుతో `పుష్ప 2`, తమిళంలో `వారసుడు`, మలయాళంలో `సీతా రామం` చిత్రాలు చేస్తోంది.