Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈ కన్నడ సోయగం.. కెరీర్ పరంగా జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. కేవలం తెలుగు భాషకే పరిమితం కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది.
అయితే అందుకు కారణం `పుష్ప`నే అంటోంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా.. ఫస్ట్ పార్ట్ను `పుష్ప ది రైస్` టైటిల్తో గత ఏడాది పాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు.. అల్లు అర్జున్, రష్మిక నటనకు విమర్శకులు నుంచి ప్రశంసలు సైతం దక్కాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే రీసెంట్గా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. `పుష్ప` మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `పుష్ప` చిత్రం తన కెరీర్లో పెద్ద టర్నింగ్ పాయింట్ అని, ఈ చిత్రంలో తన నటన చూసే `యానిమల్` మేకర్స్ తనని సంప్రదించారని చెప్పుకొచ్చింది. మానియల్ లో ఆడియెన్స్ తనలోని మరో కొత్త యాంగిల్ని చూస్తారని, తనకిది మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుందని స్పష్టం చేసింది.
బాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న చిత్రాల్లో ఒకటే `యానిమల్`. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీతో పాటు రష్మిక తమిళంలో `వారసుడు`, మలయాళంలో `సీతా రామం`, తెలుగులో `పుష్ప 2`, హిందీలో `గుడ్ బై`, `మిషన్ మజ్ను` చిత్రాల్లో నటిస్తోంది.