ప్రేమ కథల స్పెషలిస్ట్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “సీతారామం” ఆగస్టు 5వ తారీఖు విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన కీలక పాత్ర పోషించడం జరిగింది. రొమాంటిక్ మెలోడీ డ్రామా … కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో “సీతారామం” ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంది. భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ నేపథ్యంలో సినిమా స్టోరీ స్టార్ట్ చేసి అందమైన ప్రేమకథగా దర్శకుడు సినిమా తెరకెక్కించిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
సినిమాలో అఫ్రీన్ పాత్రలో రష్మిక మందన చేసిన నటన ప్రారంభంలో నెగిటివ్గా కనబడిన గాని చివరాఖరికి చాలామంది హృదయాలను కొల్లగొట్టింది. దీంతో సినిమా విజయం సాధించడంతో రష్మిక మందన చాలా హ్యాపీగా ఫీల్ అయింది. “సీతారామం” సినిమా విజయం సాధించడం పట్ల ఇటీవల రష్మిక మందన మాట్లాడుతూ… ఈ స్థాయిలో విజయం సాధించటం ఎంతగానో ఆనందం కలిగించిందని పేర్కొంది. “సీతారామం” కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాము. ఈ క్రమంలో క్లాసిక్ బ్లాక్ బస్టర్ రూపంలో కష్టానికి తగ్గ ఫలితం దక్కింది..అని రష్మీక తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక ఇదే సమయంలో “సీతారామం” హిట్ అవటం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు మరియు దర్శకులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
అందమైన మెలోడీ ప్రేమ కథ…అద్భుతమైన ప్రేమ కావ్యం “సీతారామం” అంటున్నారు. సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని మొన్నటి వరకు ప్రచారం జరుగుతూ ఉన్న సమయంలో మంచి కాన్సెప్ట్ కలిగిన “సీతారామం” సినిమా రావడం విజయం సాధించడంతో స్టోరీలు దమ్ముంటే ప్రేక్షకులు థియేటర్లోకి వస్తారని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. “సీతారామం” మాత్రమే కాదు “బింబిసారా” కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా రెండు విజయం సాధించడం.. పట్ల సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.