టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్` ఇటీవల గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ, రియల్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, మకరంద్ దేశ్పాండే తదితరులు కీలక పాత్రలను పోషించారు.
బ్యాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్తో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు. ఆగస్టు 25న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. అయితే `లైగర్` ఫ్లాప్ అవ్వడంతో.. రష్మికకు గట్టి దెబ్బ పడింది.
అసలేమైందంటే.. బాలీవుడ్ లో రష్మిక `మిషన్ మజ్ను`, `గుడ్ బై`, `యానిమల్` చిత్రాలతో పాటు `స్క్రూ ఢీలా` అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరో. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయిందంటూ టాక్ నడుస్తోంది. ఈ చిత్రం కోసం టైగర్ రూ. 35కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని చెప్పాడట. ఇందుకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట.
కానీ, షూటింగ్ స్టార్ట్ అయ్యాక టైగర్ను రెమ్యునరేషన్ తగ్గించుకోమని నిర్మాత కరణ్ కోరాడట. బాలీవుడ్ అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. పైగా కరణ్ నిర్మించిన `లైగర్` కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ నేపథ్యంలోనే టైగర్ ను పారితోషికం ను తగ్గించుకోమని కోరగా.. అందుకు ఆయన ఒప్పుకోలేదట. అందుకే ఈ మూవీని ఆపేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. రష్మిక లిస్ట్ లో నుంచి ఓ బిగ్ ప్రాజెక్ట్ ఎగిరిపోయినట్లే అవుతుంది.