Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడ మూవీతో కెరీర్ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. `ఛలో` వంటి హిట్ మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే ఇక్కడ స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్తో పాటు నార్త్లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ పరంగా జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది.
ఇకపోతే తాజాగా రష్మికపై ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట తెగ వైరల్ అయింది. అదేంటంటే.. రీసెంట్గా షూటింగ్ నిమ్మితం హైదరాబాద్ నుంచి మరో ప్రాంతానికి రష్మిక పయణించాల్సి ఉండగా.. తనతో పాటు తన పెంపుడు కుక్క కూడా ప్లైట్ టికెట్స్ బుక్ చేయాలని డిమాండ్ చేసి నిర్మాతలను ఇబ్బంది పెట్టిందట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ వార్తే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. దీనిపై రష్మిక ట్విట్టర్ ద్వారా స్పందించింది. `హే.. ఇలాంటి రూమర్స్ ఎలా సృష్టిస్తారలో అర్థం కావడం లేదు. ఆరా(రష్మిక పెట్ డాగ్) నాతో కలిసి పయణించాలని మీకు ఉన్న. తనకు మాత్రం నాతో ట్రావెల్ చేయడం అసలు ఇష్టం ఉండదు. తను హైదరాబాద్లోనే హ్యాపీగా ఉంటుంది` అంటూ ట్విట్ చేసింది.
వెంటనే మరో ట్విట్లో `క్షమించండి నవ్వు ఆపుకోలేకపోతున్నా` అని పేర్కొంది. దీంతో నెట్టింట ట్రెండ్ అవుతున్న వార్త రూమరే అని తెలిపోయాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ సరసన `పుష్ప 2`, విజయ్ దళపతికి జోడీగా `వారసుడు` చేస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న `సీతా రామం`లో ఓ కీలక పాత్రను రష్మిక పోషిస్తోంది. మరోవైపు హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్ బై`, `యానిమల్` చిత్రాలు చేస్తోంది.
Sorry but this made my day..🤣 couldn’t stop laughing..🤣🤣
— Rashmika Mandanna (@iamRashmika) June 24, 2022
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!