నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యూటీ ఖాతాలో మరో సినిమా సైతం వచ్చి చేరింది. అదే `ఎన్టీఆర్ 30`.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. గత ఏడాదే ఈ సినిమాను ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది గత కొద్ది రోజుల నుంచి జోరుగా చర్చ నడుస్తోన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆలియా భట్, జాన్వీ కపూర్, దిశా పటాని, కియారా అద్వానీ వంటి బాలీవుడ్ ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక రీసెంట్గా రష్మిక మందన్నా, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ మధ్య పోటీ నడుస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఎంతమంది పోటీ పడ్డ చివరికి ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ రష్మికనే కొట్టేసిందని తాజా లేటెస్ట్ సమాచారం ద్వారా తెలుస్తోంది.
కొరటాల ఆమెనే ఫైనల్ చేశారని వార్తను వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని అంటున్నారు. మరి ఇదే నిజమైతే లక్కీ బ్యూటీ ఖాతాలో మరో లక్కీ ఛాన్స్ పడ్డట్టే అవుతుంది.
https://newsorbit.com/cinema/mahesh-fans-are-serious-about-rashmikas-post.html