ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ ప్రాజెక్ట్ `పుష్ప ది రైజ్`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తే.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటించారు. సమంత ఇందులో స్పెషల్ సాంగ్ చేసింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం గత ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఇప్పుడు మూవీకి పార్ట్ 2గా `పుష్ప ది రూల్` రాబోతోంది. స్క్రిప్ట్ వర్క్తో పాటు పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ను సైతం కంప్లీట్ చేసిన సుకుమార్.. ఇటీవల `పుష్ప 2`ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
అయితే తాజాగా ఈ మూవీపై హీరోయిన్ రష్మిక నయా అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తన తొలి హిందీ మూవీ `గుడ్ బై` ప్రమోషన్స్లో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికకు `పుష్ప 2` గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
అందుకు ఆమె `పుష్ప 2` సినిమా మరో రెండు రోజుల్లో సెట్ పైకి వెళ్లబోతోందని, తాను కూడా ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నానని స్పష్టం చేసంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులు రష్మిక అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!