Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఛలో` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. తనదైన ట్యాలెంట్తో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం సౌత్తో పాటు నార్త్లోనూ సత్తా చాటుతున్న రష్మిక.. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది.
ఇప్పుడీమె చేతిలో ఉన్న చిత్రాల్లో `యానిమల్` ఒకటి. `అర్జున్ రెడ్డి` డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న హిందీ చిత్రమిది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుంటే.. ఆయనకు జోడీగా రష్మిక ఎంపిక అయింది. ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లగా.. ఫస్ట్ షెడ్యూల్ను మనాలీలో ప్రారంభించారు మేకర్స్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్తో బిజీ బిజీగా గడుపుతున్న రష్మిక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా హీరో రణబీర్ కపూర్పై ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. రష్మిక మాట్లాడుతూ.. `రణబీర్ కపూర్ చాలా మంచి వ్యక్తి, ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది.
ఆయనను ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు చాలా నెర్వస్ గా ఫీల్ అయ్యా. కానీ, కలిసిన ఐదు నిమిషాలకే ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. సినీ పరిశ్రమలో రణబీర్ ఒక్కడు మాత్రమే నన్ను మేడమ్ అని పిలుస్తాడు` అని చెబుతూ రష్మిక తెగ ఉప్పొంగిపోయింది. కాగా, తెలుగులో ఈమె అల్లు అర్జున్ సరసన `పుష్ప 2`, తమిళంలో విజయ్ కు జోడీగా `థళపతి 66` అనే పాన్ ఇండియా చిత్రాలు చేస్తోంది. అలాగే మలయాళ, హిందీ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్ ను టేకప్ చేసిందీ బ్యూటీ.