నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ అవకాశాలను అందుకుంటూ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ `సీతారామం` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో కీలక పాత్రను పోషించిన రష్మిక విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి .ఇకపోతే ఈ బ్యూటీ తొలి బాలీవుడ్ చిత్రం `గుడ్ బై` త్వరలోనే విడుదల కాబోతోంది. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు.
అక్టోబర్ 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్లో భాగంగా రష్మిక ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సినిమా విశేషాలతో పాటు తన బాల్యం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను చిన్నప్పటి నుంచి హాస్టల్ లోనే ఉండి చదువుకున్నానని, అందువల్ల తన బాల్యంలో ఎక్కువ శాతం హాస్టల్లోనే గడిపానని చెప్పుకొచ్చింది.
తాను ఎక్కడికి వెళ్లినా స్నేహితులు చుట్టూ ఉండే వారిని, వారినే తన ఫ్యామిలీగా భావించానని ఆమె పేర్కొంది. అలాగే టీచర్స్ పట్ల ఎంతో గౌరవం ఉండేదని, వారిలో తన అమ్మని చూసుకున్నానంటూ రష్మిక తెలిపింది. ఇక స్కూల్లో ఉన్నప్పుడు తాను యావరేజ్ స్టూడెంట్ అని.. కానీ ప్లస్ 2, డిగ్రీ చదివే టైం లో టాపర్ గా ఉండేదాన్ని అని కూడా తెలిపింది. దీంతో రష్మిక కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.