నేషనల్ క్రష్ రష్మిక కెరీర్ పరంగా ఏ రేంజ్లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్లో `సీతారామం` ఒకటి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్తో టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన వింటేజ్ లవ్స్టోరీ ఇది. 1964 కాలానికి ప్రజెంట్ టైమ్ను ముడిపెడుతూ వార్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఇందులో మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తే.. రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్, భూమిక కీలక పాత్రలను పోషించారు. కాశ్మీర్ కొండల్లోని ఒంటరి సైనికుడు లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్, అతడిని ప్రేమించే యువతి సీతామహాలక్ష్మి పాత్రలో మృనాళ్ థాకూర్ కనిపించబోతున్నారు. అలాగే కాశ్మీర్కు చెందిన ముస్లిం అమ్మాయి అఫ్రీన్ గా రష్మిక అలరించబోతోంది. కొద్ది నెలల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 5న తెలుగు, మలయాళంతో పాటు పలు భాషల్లో రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ సినిమా భారీ బజ్ను క్రియేట్ చేయగా.. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ అంచనాలను మరో లెవల్కి తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో రష్మిక ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. డైరెక్టర్ హను రాఘవపూడి `సీతారామం`లోని రష్మిక పాత్రను వివరించినప్పుడు.. ఆమె చాలా భయపడిపోయిందట. నో చెప్పిందట. అయినా ఆయన ఆమెను వదల్లేదట.
రష్మిక మాట్లాడుతూ.. `హను తనకు అఫ్రీన్ క్యారెక్టర్ గురించి చెప్పినపుడు మొదట భయం వేసింది, నేను చేయలేను అని చెప్పాను. ఇప్పటివరకు నేను బబ్లీ క్యారెక్టర్స్, యాంగ్రీ బర్డ్ మాదిరి క్యారెక్టర్స్ చేసాను. అయితే ఇంత రెబల్ గా వయొలెంట్ గా సాగె పాత్ర చేస్తే ఎంతవరకు ఆడియన్స్ ఒప్పుకుంటారా అని అనిపించింది. కానీ, పూర్తి కథ, తన క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం, అలానే నేను చేయగలను అనే ధైర్యం హను ఇవ్వడంతో కొంత హార్డ్ వర్క్ చేసి ఫైనల్ గా ఓకే చెప్పాను. ఈ సినిమా, అందులోని పాత్రలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి` అంటూ చెప్పుకొచ్చింది.