నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్తో అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ను దక్కించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సౌత్తో పాటు నార్త్ లోనూ సత్తా చాటుతూ దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ప్రోగ్రామ్కు హాజరైంది. ఈ ఫంక్షన్లో రష్మిక మోకాళ్లపైకున్న రెడ్ కలర్ షార్ట్ డ్రెస్లో ఓ రేంజ్లో క్లీవేజ్ షో చేసి అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. వీటిని చూస్తే ఆ డ్రెస్ ఏంటి రష్మికా..? అని అనకుండా ఉండలేరు. ఇప్పటి వరకు చూపించిన అందాలు ఓ ఎత్తైతే.. ఇది మరో ఎత్తు అనేలా ఆమె డ్రెస్ ఉంది.
పైగా సెలబ్రిటీలను క్లిక్మనిపించే ఫొటోగ్రాఫర్లు ఆ వేడుకలో మాత్రం రష్మికతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. రష్మికను ఒక సోఫాలో కూర్చొబెట్టి ఫొటోలు దిగారు. ఈ టైమ్లో తన డ్రెస్ మోకాలి పై వరకు ఉండటంతో ఆమె చాలా ఇబ్బంది పడింది.
ఏదేమైనప్పటికీ రష్మిక ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె తెలుగులో `పుష్ప 2` సినిమా చేస్తోంది. అలాగే తమిళంలో విజయ్ దళపతి సరసన `వరిసు(తెలుగులో వారసుడు)`, మలయాళంలో `సీతా రామం` చిత్రాల్లో నటిస్తోంది.
మరోవైపు బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా `మిషన్ మజ్ను`, బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్తో `గుడ్ బై`, రణబీర్ కపూర్ సరసన `యానిమల్` చిత్రాల్లోనూ నటిస్తోంది.
@iamRashmika with all the Press people yesterday at #HTMostStylish #RashmikaMandanna #rashmika pic.twitter.com/1AyKvXEKx9
— Rashmika Mandanna BLR Fc (@Rashmikamandan6) July 16, 2022