యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్ ను గత ఏడాది వేసవిలో ప్రకటించారు. ఈ ఏడాది వేసవి పూర్తైపోయినా.. `ఎన్టీఆర్ 30` మాత్రం పట్టాలెక్కడం లేదు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు..? అన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే అలియా భట్, కియారా అద్వానీ, పూజా హెగ్డే, జాన్వీ కపూర్, దిశా పటానీ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి.
కానీ, ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఇద్దరు ముద్దుగుమ్మల మధ్యే పోటీ నటిస్తోందట. ఆ ఇద్దరిలో ఒకరు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాగా.. `సీతారామం` మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన మృణాల్ ఠాకూర్ మరొకరు.
ఈ ఇద్దరిలోనే ఒకరిని ఫైనల్ చేయాలని డైరెక్టర్ కొరటాల శివ భావిస్తున్నారు. `పుష్ప`తో ఇండియా వైడ్గా పాపులర్ అయింది రష్మిక. మరోవైపు మృణాలు కూడా ఏమీ తక్కువ కాదు. ఇటీవల విడుదలైన `సీతారామం` సౌత్లోనే కాదు నార్త్లోనూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీతో మృణాల్కు సైతం పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. మరి ఇక ఈ ఇద్దరిలో ఫైనల్గా ఎన్టీఆర్తో జోడీ కట్టబోయేది ఎవరు అన్నది తేలాల్సి ఉంది.