మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
తాజాగా డబ్బింగ్ పనులు సైతం షురూ అయ్యాయి. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా వెల్లడించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కనుక ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే తాజాగా ఈ మూవీలో రవితేజ పాత్రకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో రవితేజ వైజాగ్ రంగరాజు అనే మాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట.
ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. వైజాగ్ రంగారావుగా రవితేజ రచ్చ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని, ఆయన పాత్ర సినిమా హైలెట్గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఇదే నిజమైతే రవితేజ ఫ్యాన్స్ కు కన్నుల పండుగే అవుతుంది. కాగా, ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ దాదాపు కన్ఫామ్ అయ్యింది.
త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. ఇక టైటిల్ పాత్రలోనే చిరంజీవి కనిపించబోతున్నారు. ఆయన కూడా ఈ చిత్రంలో మాస్ క్యారెక్టర్ ను పోషిస్తున్నారు. ఇటీవల సెట్స్ను లీకైన ఆయన పిక్స్.. ఈ విషయాన్ని కన్ఫామ్ చేసేశాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!