`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న వెంటనే `ఆచార్య`తో డిజాస్టర్ ను మూట కట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు నటిస్తుంటే.. శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర, జయరాం తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఇప్పటికే యాబై శాతానికి పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.
కానీ, ఇంతలోనే శంకర్ మధ్యలో ఆపేసిన `ఇండియన్ 2` ప్రాజెక్ట్ తెరపైకి రావడంతో.. `ఆర్సీ 15` షూటింగ్ కు బ్రేకులు పడుతూ వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం.. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా రావడం కష్టమేనట.
షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది దసరాకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ లెక్కన `ఆర్సీ 15` కోసం మరో ఏడాది ఆగాల్సిందే అని అంటున్నారు. ఏదేమైనా ఇది ఒక రకంగా రామ్ చరణ్ అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి.
https://newsorbit.com/cinema/latest-update-on-rc15-movie-title.html
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!