సినీ నటుడు, రాజకీయ నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు ఇక లేరన్న సంగతి తెలిసిందే. రెబల్ స్టార్గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్టంరాజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొంత కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణంపై ప్రభాస్తో సహా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరోవైపు సినీ ప్రిముఖులు, రాజకీయ నాయకులు కృష్ణంరాజు మృతిపై సంతాపం తెలుపుతున్నారు. ఇకపోతే తన చిరకాల కోరికలు తీరకుండానే కృష్ణంరాజు కన్నుమూయడం బాధాకరం. ప్రభాస్ పెళ్లి చూడాలనేది కృష్ణంరాజు కోరికల్లో ఒకటి. తమ్ముడి కొడుకైనా ప్రభాస్ అంటే ఆయనకు ప్రాణం. ప్రభాస్ ను వెనకుండి నడిపించి పెద్ద స్టార్ ను చేశారు.
అలాగే ప్రభాస్కు పెళ్లి చేయాలని కూడా కృష్ణంరాజు ఎంతో ప్రయత్నించారు. ప్రభాస్ పెళ్లి కంటే తనకు సంతోషాన్ని ఇచ్చే అంశం మరొకటి లేదని ఆయన చాలా సార్లు వెల్లడించారు. కానీ, ఇప్పుడు ప్రభాస్ పెళ్లి చూడకుండానే వెళ్లిపోయారు.
ప్రభాస్ హీరోగా `ఒక్క అడుగు` అనే చిత్రం చేయాలని కృష్ణంరాజు అనుకున్నారు. ఈ మూవీకి ఆయనే దర్శకనిర్మాతగా పని చేయాలని ఆశపడ్డారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. కానీ పలు కారణాలతో ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. అలాగే `విశాల నేత్రాలు` నవల ఆధారంగా హై బడ్జెట్ తో సినిమా తీయాలని కృష్ణంరాజు అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. ఇక కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజుకు గవర్నర్గా పనిచేయాలన్న కోరిక ఉండేది. కానీ, అదీ తీరలేదు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!