రెజీనా కాసాండ్రా.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. `శివ మనసులో శృతి` మూవీతోనే సినీ కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా తనదైన టాలెంట్తో తెలుగు, తమిళ్ భాషల్లో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం `నేనే నా`, `శాకినీ ఢాకినీ` చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్లు చేస్తోంది. ఇటీవలె `అన్యస్ ట్యుటోరియల్` సిరీస్తో ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వగా.. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతీ రెజీనా రీసెంట్గా పాపులర్ టీవీ షో `అలీతో సరదాగా`తో పాల్గొంది.
Nenena: ‘నేనే నా..? అంటున్న రెజీనా..లేటెస్ట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ కార్యక్రమంలో రెజీనా వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది. అలాగే ఓరోజు అర్థరాత్రి స్వీట్ కోసం ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిందట. ఈ విషయాన్ని సైతం ఆమె స్వయంగా బయట పెట్టింది. రెజీనా మాట్లాడుతూ.. “ఓ రోజు రాత్రి 11 గంటల టైమ్లో మిస్టీ దోయ్ స్వీట్ తినాలనిపించి బయటకు వెళ్లాను.
కానీ, అప్పటికే షాప్స్ అన్నీ క్లోజ్ చేసేశారు. ఒక షాప్ ఉండడంతో అక్కడికి వెళ్లి అడగ్గా.. క్లోజింగ్ టైమ్ అని చెన్నారు. దాంతో `నేను ప్రెగ్నెంట్.. ఆ స్వీట్ తినాలనుంది` అని అబద్ధం చెప్పా. వెంటనే స్వీట్స్ ఇచ్చారు“ అంటూ రెజీనా చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఓ స్వీట్ కోసం అంత పెద్ద అబద్ధం ఆడానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.