వైష్ణవి తేజ్ హీరోగా తెరకెక్కిన “రంగ రంగ వైభవంగా” రిలీజ్ వేడుక నిన్న ఫ్యాన్స్ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా హాజరయ్యారు. ఇంకా మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ సంచలన స్పీచ్ ఇచ్చారు. ఈ క్రమంలో మాట్లాడుతున్న సమయంలో మధ్యలో అభిమానులు గోల గోల చేస్తూ ఉండటంతో.. సాయి ధరమ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దయచేసి ఎవరూ గోల చేయవద్దు. షార్ట్ టైం మెమరీ లాస్ ఉంది. చెప్పేది మొత్తం మర్చిపోతాను. ఒక్క ఐదు నిమిషాలు ఆగిపోతే మొత్తం స్పీచ్ కంప్లీట్ చేస్తాను.
దయచేసి ఎవరూ ఆరవదురా బాబు. ఈ రీతిగా మాట్లాడుతూ తన తమ్ముడు వైష్ణవ తేజ్ మొదటి సినిమాతోనే సక్సెస్ కావడం తనకి ఎంతగానో ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చాడు. అయినా గాని అభిమానులు గోల చేయటంతో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ నేనేమీ తాగి రాలేదు. నాకు మందు అలవాటు కూడా లేదు. దయచేసి ఎవరూ అరవవద్దు. నాకన్నా మంచి నటుడు మా తమ్ముడా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు. రంగ రంగ వైభవంగా సెప్టెంబర్ రెండవ తారీకు విడుదల కాబోతోంది. కనుక ప్రతి ఒక్కరు సినిమా అని థియేటర్ లోనే చూడాలని సాయిధరమ్ తేజ్ తెలిపారు.
ఇదే సమయంలో ఆ రోజు తన గురువు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కచ్చితంగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి ఆయన పేరు చెప్పుకొని పార్టీ చేసుకోండి.. అంత అభిమానులకు సరికొత్త సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఇంకా తాను యాక్సిడెంట్ నుండి బయటపడటానికి ప్రధాన కారణం హెల్మెట్ అని అన్నారు. అది లేకపోయి ఉంటే ఈ రోజు నేను మీ మధ్య ఉండే వాడిని కాదు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకోండి జాగ్రత్తగా జర్నీ చేయండి అంటూ సాయి ధరమ్ తేజ్ అదరగొట్టే స్పీచ్ ఇవ్వటం జరిగింది.