ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉంటూ నటనతోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ తో సినీ కెరీర్ ను ప్రారంభించిన సాయి పల్లవి.. అనతి కాలంలోనే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హోదాను సొంతం చేసుకుంది.
మలయాళ, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాలు చేసిన ఈ బ్యూటీ.. ఇటీవల సినిమాల ఎంపికలో జోరును బాగా తగ్గించింది. ఈ ఏడాది సాయి పల్లవి నుంచి `విరాటపర్వం`, `గార్గి` చిత్రాలు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయనుకు జోడిగా ఓ సినిమా చేస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. సినిమాలను ఎంపిక చేసుకునే టైంలో హీరో ఎవరు అనేది పట్టించుకోనని.. కథ నచ్చితే ఓకే చెప్తానని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
అలాగే టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ డాన్స్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ తనకు బాగా నచ్చుతుందని, ఆయనను చూసినప్పుడల్లా `మగాళ్లు ఇంత అందంగా ఉంటారా..?` అన్న ఫీలింగ్ కలుగుతుందని తెలిపింది. ఇక తన తొలి సినిమా డైరెక్టర్ అయిన శేఖర్ కమ్ముల గారికి ఎప్పుడు రుణపడి ఉంటారని సాయి పల్లవి పేర్కొంది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
https://newsorbit.com/news/sai-pallavi-no-on-that-one-saying-sai-pallavi-that-is.html