Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి పరిచయాలు అవసరం లేదు. ఓ తమిళ చిత్రంతో సినీ కెరీర్ను ప్రారంభించిన సాయి పల్లవి.. మలయాళ చిత్రం `ప్రేమమ్`తో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత `ఫిదా`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది.
అందం, అభినయంతో వరుస అవకాశాలను అందిపుచ్చుకున్న సాయి పల్లవి.. తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్తో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. గ్లామర్ షోకు ఆమడ దూరంగా ఉండే సాయి పల్లవి.. వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. ఇకపోతే ఇటీవలె ఈ భామ `విరాట పర్వం`తో ప్రేక్షకులను పలకరించింది.
నక్సలిజం నేపథ్యంలో ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు రానా దగ్గుబాటి హీరోగా నటించాడు. జూన్ 17న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ.. మంచి టాక్ని సొంతం చేసుంది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన పల్లెటూరి అమ్మాయి వెన్నెలగా సాయి పల్లవి నటకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది.
ఈ క్రమంలోనే టాలీవుడ్లో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా..? అని ప్రశ్నించగా.. ఆమె ఇద్దరు హీరోల పేర్లు చెప్పింది. పైగా ఆ ఇద్దరు హీరోలు ఒకే కటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఇంతకీ వారెవరో కాదు అక్కినేని నాగచైతన్య, రానా దగ్గుబాటి. నాగచైతన్య, రానాలు టాలీవుడ్లో తనకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ అని, వారితో ఒక ఫ్యామిలీ అనే ఫిలింగ్ వస్తుందని చెప్పింది. ఒకే ఫ్యామిలీలా రానా, చైతులు తనపై కేర్ తీసుకుంటారని సాయి పల్లవి పేర్కొంది. కాగా, నాగచైతన్యతో సాయి పల్లవి `లవ్ స్టోరీ` మూవీ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…