సాయి పల్లవి.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగరాయ్` చిత్రాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి.. ఇటీవల `విరాట పర్వం`తో ప్రేక్షకులను పలకరించింది. రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న విప్లవాత్మక ప్రేమ కథ ఇది.
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్గా ఈ మూవీ మంచి విజయం సాధించలేకపోయింది. దీంతో ఈ సినిమాను రెండు వారాలకే ఓటీటీలోకి దించేశారు.
ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో జూలై 1 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. `విరాటపర్వం` సినిమా ఓటీటీ ప్రమోషన్స్ కోసం నెట్ఫ్లిక్స్ స్టార్ట్ చేసిన`మై విలేజ్ షో` అనే టాక్ షోలో రానా దగ్గుబాటితో కలిసి సాయి పల్లవి పాల్గొంది. ఈ షోను గంగవ్వ నిర్వహిస్తోంది. అయిత ఈ ఇంటర్వ్యూలో గంగవ్వ `విరాటపర్వం సినిమాలో రవన్న పాత్రకు లవ్ లెటర్ రాసినట్లు.. రియల్ లైఫ్ లో ఎవరికైనా లవ్ లెటర్ రాశావా..?` అని సాయి పల్లవిని ప్రశ్నించింది.
అందుకు సాయి పల్లవి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఏడవ తరగతిలో ఉన్నప్పుడే ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని.. అయితే ఆ లెటర్ తన పేరెంట్స్ కంట పడడంతో తనను చితకబాదారని సాయి పల్లవి ఓపెన్గానే చెప్పేసింది. దీంతో ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!