Salaar: `కేజీఎఫ్` మూవీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్కు `సలార్` అనే టైటిల్ను కన్ఫామ్ చేశారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. కొంత షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత కరోనా విజృంభించడం, మరోవైపు `కేజీఎఫ్ 2`, `రాధేశ్యామ్` చిత్రాలు విడుదలకు సిద్ధమవ్వడంతో.. సలార్ షూటింగ్కు బ్రేక్ వేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మళ్లీ ఇటీవలె ఈ మూవీ చిత్రీకరణను రీ స్టార్ట్ చేసిన మేకర్స్.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ను జరుపుతున్నారు. అయితే తాజాగా సలార్ మూవీ రిలీజ్పై ఓ క్రీజే అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీ విడుదలకు మేకర్స్ విడుదల తేదీ లాక్ చేశారట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతోందట.
ఆ దిశగా చిత్ర టీమ్ అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా 30 శాతం మాత్రమే చిత్రీకరణ జరుపుకుంది. ఈ ఏడాది ఆఖరికి మిగతా చిత్రీకరణ మరియు ఇతర పనులను పూర్తి చేసేసి.. ఫిబ్రవరి నుండీ ప్రచార కార్యక్రమాలను షురూ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమై సలార్ ఏప్రిల్కి వస్తే.. ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయమవుతుంది.