ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎటువంటి పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం, టాలెంట్తో సౌత్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని ఇంటికి కోడలు అయింది. చైతు-సామ్ దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్నారు.
2017 గోవాలో పెద్దల సమక్షంలో రెండు సాంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. కానీ, ఎక్కువ కాలం వీరు కలిసి ఉండలేకపోయారు. కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుని సామ్-చైతూ సపరేట్ అయిపోయారు. అయితే చైతుతో విడిపోయినా అతడితో కలిసి ఉన్న ఇంటిని మాత్రం ఆమె వదిలి పెట్టలేదు.
పైగా ఆ ఇంటిని ఒకసారి అమ్మేసి.. మళ్లీ ఎక్కువ డబ్బు పెట్టి సామ్ కొనుక్కుందట. ఈ విషయాన్ని తాజాగా సీనియర్ నటుడు మురళీ మోహన్ బయటపెట్టాడు. మురళీ మోహన్ తన తనయుడి కోసం కట్టించుకున్న అపార్ట్మెంట్నే చైతు-సామ్లు కొనుగోలు చేశారు. పెళ్లి తర్వాత ఆ అపార్ట్మెంట్లోనే కాపురం పెట్టారు. ఈ విషయంపై మురళ్లీ మోహన్ మాట్లాడుతూ.. `నాగచైతన్య- సమంత మా అపార్ట్మెంట్నే కొనుక్కున్నారు. అందులోనే కలిసి ఉండేవారు. తర్వాత వారిద్దరూ ఉండే అపార్ట్మెంట్ను అమ్మేసి.. ఓ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నారు.
కానీ కొత్తిల్లు రీమోడలింగ్ చేసేంతవరకు ఇక్కడే ఉంటామని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంతలోనే మనస్పర్థలు వచ్చి వారిదదరూ విడిపోయారు. ఆ తర్వాత మంచి ఇంటి కోసం సమంత చాలా వెతికింది. కానీ, ఏదీ నచ్చలేదు. చివరకు సౌకర్యాలు, సేఫ్టీ ఇక్కడే బాగుందని భావించి అమ్మేసిన అపార్ట్మెంట్నే తనకు కావాలంటూ సమంత నా దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆ ఇల్లు కొన్నవాళ్లతో మాట్లాడి వారికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ఆ ఇంటిని తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం అక్కడే తన తల్లితో కలిసి నివసిస్తోంది` అంటూ చెప్పుకొచ్చారు.